నెక్స్ట్ లెవెల్ డాన్స్ పర్ఫామెన్స్ భయ్యా.. చూస్తే గూస్ బంప్స్ అంతే?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతోంది తెలుగులో ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో. దాదాపు 15వ సీజన్ నుంచి ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అంతేకాదు ఎంతోమంది కొరియోగ్రాఫర్లు కి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఈ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న వారే ఇక ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ కొరియోగ్రాఫర్ లుగా కొనసాగుతున్నారు అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నా జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూడా ఒకప్పుడు ఢీ షో లో కంటెస్టెంట్ లు కావడం గమనార్హం.

 ఇలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈ  కార్యక్రమంలో పాల్గొనడానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్ లు వస్తూ ఉంటారు. ప్రతివారం అదిరిపోయే డాన్సులతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం మాత్రమే కాదు ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా ఒక సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ టీవీ నిర్వాహకులు. 'నా ఆట చూడు' అంటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్లాన్ చేసి దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

 ఢీ షో లో కేవలం కంటెస్టెంట్ లు మాత్రమే డాన్స్ చేస్తే ఇక నా ఆట చూడు కార్యక్రమంలో మాత్రం ఏకంగా డాన్స్ మాస్టర్ లు కూడా కాలు కదపడం గమనార్హం. అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ కార్యక్రమంలోని ఒక్కో డాన్స్ పర్ఫార్మెన్స్ గూస్బంప్స్ తెప్పించే విధంగానే ఉంది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత డాన్స్ అదిరిపోయింది భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరు.  ఇది నెక్స్ట్ లెవెల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అంటున్నారు మరికొంతమంది. ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము అంటూ కొంతమంది కామెంట్ లు పెడుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: