బిగ్ బాస్ లోకి చీపురుతో అషురెడ్డి తల్లి.. అందరూ షాక్?

praveen
ఈ ఏడాది బిగ్ బాస్ కార్యక్రమం సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడులా కేవలం గంట ఎపిసోడ్  మాత్రమే కాకుండా 24 గంటల పాటు ప్రతిక్షణం బిగ్బాస్ వీక్షించేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తోంది అనే చెప్పాలి. బిగ్బాస్ ఓటిటి హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్ లు కూడా వెళ్లారు అనే చెప్పాలి. ఇక ప్రతి రోజూ ప్రతి నిమిషం ఇక ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులు ఆకర్షిస్తూనే ఉంది.

 ఇప్పటికే బిగ్బాస్ కార్యక్రమంలో అరవై రోజులు పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే.  అయితే సాధారణంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు సంబంధించిన కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించి బిగ్ బాస్ సర్ప్రైస్ ఇస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసిన హౌస్ లోని కంటెస్టెంట్ లు ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం అటు బిగ్బాస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఎప్పుడూ తెగ  కనెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి సర్ప్రైస్ ఇచ్చేసాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.

 ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా ఆశు రెడ్డి తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సాధారణంగా ఎవరైనా తమ ప్రియమైన వారిని కలిసేందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకు వెళ్తూ ఉంటారు. కానీ అషు తల్లి మాత్రం ఏకంగా చీపురు పట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. దీంతో బిగ్బాస్ నిబంధనల ప్రకారం ఫ్రీజ్ లో ఉన్న అషు ఇప్పుడు అందరి ముందు కొట్టకు నా పరువు పోతుంది అంటూ బ్రతిమాలింది. ఇక ఆ తర్వాత ఇక వెంటనే వెళ్లి తల్లిని ప్రేమగా హత్తుకుంది. ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ భార్య పాప కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో ఎంతో ఎమోషనల్ అయ్యారు నటరాజ్ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: