బాలయ్య...బోయపాటి కాంబినేషన్లో నాలగవ సినిమా... అప్పటినుండి ప్రారంభం కానున్న షూటింగ్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్ లు ఉంటాయి.  అలా సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా... అని ఆ హీరో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సూపర్ హిట్ కాంబినేషన్ లలో బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకూ సింహ , లెజెండ్ , అఖండ మూడు సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్ లను కూడా సాధించాయి. 

ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విషయాలు కావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు మరో సినిమా వస్తుందా..?  ఎప్పుడు చూద్దామా అని బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం  అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే మరో సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం బోయపాటి శ్రీను , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.  అలాగే ప్రస్తుతం బాలకృష్ణ ,  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  ఈ సినిమా తర్వాత బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా మొదలు కానున్నట్లు తెలుస్తోంది.  బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ 2023 లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమాను 2024 వ సంవత్సరఓ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: