బాలయ్య - బోయపాటి లైన్ క్లియర్.. ఈసారి పొలిటికల్ టచ్ తో..?

Anilkumar
తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవలే నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా 'అఖండ' .అయితే ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఇకపోతే బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళను సాధించిన సినిమా అది. ఇక ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.ఇకపోతే బాలయ్య – బోయపాటి కాంబోలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఇదిలావుంటే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ ఇంకోసారి రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు బాలయ్య ఎప్పుడు టైమ్ ఇచ్చినా, ఆయనతో సినిమా చేయడానికి తాను రెడీ.. అంటూ పదే పదే బోయపాటి చెబుతుంటాడు.

అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమాకి లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది.ఇకపోతే  వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో ఈ కాంబినేషన్‌పై ప్రకటన రాబోతోందట.ఇక  ఈలోగా బాలయ్య తన చేతిలోని కమిట్మెంట్స్ పూర్తి చేస్తాడట. అంతేకాకుండా మరోపక్క, బోయాటి కూడా తన కమిట్మెంట్స్ పూర్తి చేసుకోనున్నాడు.అయితే 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, బాలయ్య – బోయపాటి కాంబోలో సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇకపోతే రాజకీయ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుందట.కాగా  2024 ఎన్నికలకు ముందర ఈ సినిమాని విడుదల చేయాలనే ప్లాన్‌తో వున్నారట.

ఇకపోతే పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయితే 'అఖండ' సినిమా టైమ్‌లోనే బాలయ్య – బోయపాటి తమ కాంబోలో తదుపరి సినిమాపై ఓ నిర్ణయానికి వచ్చారట. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు బోయపాటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిత్తూరు శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: