బోరున ఏడ్చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

praveen
నందిత శ్వేత.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించింది. పలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.. ఇక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించే మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్. ఇక అందం అభినయం లో కూడా  ఎవరికి ఎక్కడ తక్కువ కాదు. కొర చూపులతో ఒక్కసారి కన్నుగీటింది అంటే చాలు కుర్రకారు మతిపోతూ ఉంటుంది. అంత అందం ఈ అమ్మడి సొంతం. అలాంటి నందిత శ్వేతా కి ఎందుకొ తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం అంతగా కలిసి రాలేదు. ఇక వరుస అవకాశాలు అందుకున్న సరైన బ్రేక్ మాత్రం రాలేదు అనే చెప్పాలి.

 ఇక ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఎందుకో నందిత శ్వేతా మాత్రం అనుకున్నంతగా క్లిక్ ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకుంటుంది ఈ సొగసరి. కాగా ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ లో జడ్జిగా ప్రత్యక్షమైంది. ఇక అక్కడ కంటెస్టెంట్స్ చేసే డాన్సులకు జడ్జిమెంట్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతుంది. ఇకపోతే ఇటీవలె ఢీ షో వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

 ఈ ప్రోమో ఎప్పటిలాగానే ఎంతో సందడి సందడిగా సాగిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ప్రోమో చివరిలో మాత్రం నందిత శ్వేత కన్నీళ్లు పెట్టుకుని బోరున ఏడ్చేసింది. ఏప్రిల్ 30వ తేదీన నందిత శ్వేత పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఢీ నిర్వాహకులు ఈ అమ్మడికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అడ్వాన్సుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతలోనే ప్రదీప్ ఎవరో ఇచ్చిన గిఫ్ట్ తీసుకువచ్చి నందిత శ్వేతా కి ఇస్తాడు. నవ్వుతూ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన నందితా శ్వేత ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటు బోరున ఏడ్చేసింది. దీంతో ఆ బహుమతి లో ఏముంది అన్నది అక్కడ ఉన్న వారికే కాదు ఇక ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది అని చెప్పాలి. మరి నందిత శ్వేత ఎందుకు ఏడ్చిందో తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్ వచ్చేంత వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: