సుధీర్ చెంప కొరికిన పూర్ణ.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ?

praveen
హీరోయిన్ పూర్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అవును అనే హారర్ మూవీ తో తెలుగు ప్రేక్షకుల అందరినీ అలరించిన పూర్ణ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఢీ అనే కార్యక్రమంలో జడ్జిగా అవతారమెత్తింది అనే విషయం తెలిసిందే. ఇక ఇలా ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. సాధారణంగా ఈ కార్యక్రమంలో ఎవరైనా బాగా డాన్స్ చేస్తే ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కానీ పూర్ణ మాత్రం ఏకంగా కంటెస్టెంట్స్ ను  దగ్గరికి తీసుకుని చంప కొరకడం లాంటివి చేస్తూ ఉంటుంది.

 ఏకంగా పూర్ణ కంటెస్టెంట్ ల చెంప కొరకడం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది  ఆ తర్వాత సీజన్లో పూర్ణ ఢీ షో జడ్జిగా తప్పుకుంది. అయితే ఇక ఇప్పుడు మాత్రం జబర్దస్త్ లో జడ్జిగా అవతారమెత్తింది అని చెప్పాలి. జబర్దస్త్ లో జడ్జిగా వచ్చిన పూర్ణ అప్పుడు ఢీ షో లో చేసింది ఇక ఇప్పుడు జబర్దస్త్ లో కూడా చేసింది. తనకు కిస్ ఇవ్వమని పూర్ణ ని అడుగుతాడు సుడిగాలి సుధీర్.. దగ్గరికి రా అంటూ పిలుస్తుంది పూర్ణ. సుధీర్ చెంప కొరకడానికి సిద్దమవుతోంది.

 ఇదంతా స్టేజ్ మీద నుంచి గమ నిస్తున్న రష్మి మీరు సుధీర్ చెంప కొరికారు అంటే నేను ఎంతగానో ఫీలవుతాను అంటు  చెబుతుంది. అయితే ఇక రష్మీ ఎంత చెప్పినా పూర్ణ సుధీర్ చెంప కొరికింది అన్నది అర్ధమవుతుంది. దీంతో తెగ ఫీల్ అయిపోయింది రష్మి. ఇక పూర్ణ అలా చేయడం తో ఏకంగా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది రష్మి.  ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో భాగంగా ఇదంతా జరిగింది. ఇక ఇదంతా చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ మిస్ అవకుండా చూడాలని ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: