బోయపాటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడట..!!

P.Nishanth Kumar
హీరోలతో పాటు దర్శకులు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇమేజ్ తో సంబంధం లేకుండా సినిమాల తోనే ఒక్కసారిగా మార్కెట్ ను విస్తరించు కోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొందరు సక్సెస్ అవగా మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అలా బోయపాటి శ్రీను మరియు ఉస్తాద్ రామ్ పోతినేని కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అంతకుముందు వీరిద్దరు కూడా ప్రాంతీయ చిత్రాలతోనే ప్రేక్షకులను ఎంతగానో లభించగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

 బోయపాటి శ్రీను ఈ సినిమాను ఏ స్థాయి లో చేస్తాడు అని అందరూ ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు హిందీలో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఆందుకోగా తాజాగా ఆయన చేసిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలా ఈ సినిమా ద్వారా బోయపాటి శ్రీను దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకొకవైపు రామ్ పొతినేని డబ్బింగ్ చిత్రాలతో కూడా నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. హిందీలో యూట్యూబ్ లో విశేష ఆదరణ తగ్గించుకుంటూ ఉండగా ఈ హీరో హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు.

 ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను తో కలిసి భారీ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. 100 కోట్ల బడ్జెట్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఒక స్థాయిలో చేయబోతున్నారట. అఖండ సినిమా ను 56 కోట్లతో విక్రయించగా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి వందకోట్ల పెట్టుబడి సబబే అనిపిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదల కాబోతు ఉండగా శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్లోనే ఇప్పటి వరకు లేనటువంటి బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: