వెక్కి ఎక్కి ఏడ్చిన యాంకర్ రష్మి.. ఎందుకో తెలుసా?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ ఎంతో కష్టపడి పనిచేసే వాక్చాతుర్యం మాత్రం అందరికీ తెగ నచ్చేసింది అని చెప్పాలి. ఇక జబర్దస్త్ కార్యక్రమం ఎంత క్రేజ్ సంపాదించుకుందో బుల్లితెరపై యాంకర్ రష్మి కూడా అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాదు సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు గా ప్రేక్షకులను నమ్మించడం తో ఈ అమ్మడికి కాస్త ఎక్కువగానే పాపులారిటీ వచ్చేసింది అని చెప్పాలి.

 అయితే మొన్నటి వరకూ జబర్దస్త్ కార్యక్రమం లో యాంకర్ గా చేసిన రష్మి అనసూయ ఎంట్రీ తో చివరికి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం లోకి వెళ్ళిపోయింది. ఇక ప్రతీ వారం కూడా తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదలైంది.  ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడిగా మారిపోయింది. కానీ ప్రోమో చివరిలో రష్మీ కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియో ని చూపించారు. అప్పటివరకూ  కమెడియన్స్ చేసిన స్కిట్ లకు పగలబడి నవ్విన రష్మి ఒక్క సారిగా వెక్కి వెక్కి ఏడవడానికి కారణం ఏంటి అని ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

 అయితే ఇలా ఏడుపులు.. లవ్ ట్రాక్ లు అన్నీ కూడా ఈ టీవీ లో ఇటీవల కాలంలో టిఆర్పి రేటింగ్ కోసం చూపించడం సర్వసాధారణంగా మారిపోయింది  అంటున్నారు ప్రేక్షకులు. అందుకే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రష్మీ చివరిలో కన్నీళ్లు పెట్టుకుంది ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఆమెను ఓదార్చారు అంటూ చెబుతున్నారు. ఇలాంటివి చాలా చూశాం ఇప్పుడు ఏమి కొత్త కాదు అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.  మరికొంతమంది స్పందిస్తూ రష్మీ ఇప్పుడు ఎందుకు ఏడిచి ఉంటుంది అని అభిమానులు అనుకుంటున్నారట.. ఏదేమైనా ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో రష్మీ వెక్కివెక్కి ఏడ్వంటం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: