నిప్పురవ్వ సినిమా గురించి తెలియని విషయాలు ఇవే..!!

Divya
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో నిప్పురవ్వ సినిమా కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదట.. అలాగని ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ కానేకాదు. కానీ ఈ సినిమా ప్రారంభించడమే కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయట. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా దివ్యభారతి అని అనుకున్నారు. ఇక ఆమెకు కూడా బొబ్బిలి రాజా వంటి చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళింది. కానీ మొదట ఈ చిత్రాన్ని దివ్యభారతి తో నటించాలి అనుకున్నారు .. ఈ చిత్ర నిర్మాత అయినటువంటి విజయశాంతినే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది.
ఇక గతంలో కూడా బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చి విజయాన్ని అందుకున్నాయి. పై గా డైరెక్టర్ కూడా కోదండరామిరెడ్డి, ఇక రైటర్స్ పరుచూరిబ్రదర్స్ కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. అయితే ఒక విషయంలో బాలకృష్ణ విజయశాంతి ల మధ్య గొడవలు జరిగాయట. కర్తవ్యం చిత్రం ద్వారా విజయశాంతి ఇమేజ్ పెరగడంతో ఈమె కథలు కొన్ని మార్పులను కోరినట్లు తెలుస్తోంది. అలా వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు ఏర్పడ్డాయట.
నిప్పురవ్వ సినిమాకి మొదట నిర్మాత విజయశాంతి.. ఆ తర్వాత బాలకృష్ణ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇక ఈ చిత్రాన్ని చెన్నై లో AVM స్టూడియో లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి ముఖ్య అతిథులుగా మోహన్ లాల్, రజనీకాంత్ కూడా హాజరయ్యారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇందులోని యాక్షన్ ఎపిసోడ్ లో ఒక వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తోంది.. ఇక మరొక ఇద్దరికీ కూడా గాయాలయ్యాయని విషయంపై చిత్రబృందం అబద్ధాలని.. వీటన్నింటిని కొట్టిపారేసింది. ఇక ఆ సమయంలోనే ఆ ముగ్గురి ఫ్యామిలీస్ పెద్దఎత్తున రచ్చ చేశారు. ఇక బడ్జెట్ అనుకున్నదాని కంటే మూడు రెట్లు ఎక్కువ పెరిగిపోయింది. ఎన్నో అవాంతరాలు మధ్య ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని విడుదల చేయగా ఈ సినిమాను చూసిన ఫ్యాన్స్ బిత్తర పోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: