మరోసారి ప్రభాస్ సరసన అనుష్క..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో  ప్రభాస్ నటించిన  తాజా చిత్రం 'రాధేశ్యామ్' .ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు.ఇక ఈ సినిమాని  పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్  చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.అయితే  ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా రిజల్ట్‌ను పక్కనబెట్టిన ప్రభాస్, తాజాగా ఇప్పుడు తన నెక్ట్స్ 
ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.

ఇదిలా ఉంటె ఈ క్రమంలోనే ప్రభాస్ వెంటనే ఓ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఇకపోతే దీనిలో భాగంగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించాలని రెడీ అవుతున్నాడు. అంతే కాదు ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించి, అంతే త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ఫిక్స్ అయ్యారు.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ అనుష్క శెట్టి మరోసారి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే గతంలో ప్రభాస్‌తో అనేక సినిమాల్లో నటించిన అనుష్క, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. 

తాజాగా ఈ క్రమంలోనే అనుష్కను ప్రభాస్ పక్కన చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే దీంతో మారుతి మరోసారి ఈ కాంబోను మనమందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడట. కాగా  ఈ సినిమాకు సంబంధించిన కథను అనుష్కకు చెప్పాడట ఈ డైరెక్టర్.అయితే తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా అనుష్క చెప్పకపోవడం గమనార్హం. ఇకపోతే మరి ప్రభాస్ కోసం మారుతి ఎలాంటి సబ్జెక్ట్‌ను పట్టుకొస్తున్నాడో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి.మొత్తం మీద మరోసారి ప్రభాస్ అనుష్క ఇద్దరు నటించబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అంతో ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని ఫుల్ ఖుషి అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: