ప్రేక్షకులను అలరిస్తున్న 'శభాష్ మిథు' టీజర్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ తాప్సీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  తాప్సి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఝుమ్మంది నాదం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.  ఈ మూవీ లో తన అందచందాలతో ప్రేక్షకులను  తాప్సి ఆకట్టుకుంది,  ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది,  అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలలో నటించిన తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే తాప్సి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది,  అందులో భాగంగా తాప్సి ఇప్పటికే పింక్ ,  సాండ్ కీ అంఖ్, తప్పడ్, రష్మీ రాకెట్ , సినిమాల్లో నటించింది,   అలాగే తాప్సి ఈ మధ్యనే లూప్ ల పేట మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఈ సినిమా లో తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి,  ఇది ఇలా ఉంటే స్టార్ హీరోయిన్ తాప్సీ టైటిల్ రోల్‌ లో నటించిన చిత్రం శభాష్ మిథు అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కింది.  శభాష్ మిథు టీజర్‌ ను తాజాగా విడుదల చేశారు,  ఇది ఇలా ఉంటే జెంటిల్‌మేన్ స్పోర్ట్ అయిన క్రికెట్‌ లో చరిత్రను తిరగరాయడానికి ఆమె ఇబ్బంది పడలేదు,  ప్రపంచానికి తన కథ ను ఆమె చాటిచెప్పింది అని ఇన్‌ స్టాగ్రామ్‌ లో  తాప్సీ పేర్కొంది.   రవిశాస్త్రీ వాయిస్ ఓవర్‌తో శభాష్ మిథు టీజర్ ప్రారంభం అయ్యింది,  టీజర్‌ లో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే డబుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్, 23 ఏళ్లుగా స్పోర్ట్ ఆడుతున్న క్రీడాకారిణీ అని తాప్సీ ని ఈ టీచర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.  ఈ మూవీ కి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు, వయకాం 18స్టూడియోస్ ఈ మూవీని నిర్మించింది. మిథాలీ రాజ్ క్రికెట్ ప్రయాణాన్ని రియల్‌గా చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేడియాల్లో ఈ మూవీ ని చిత్రీకరించారు,  తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: