అనుష్క కేవలం వాళ్ళతో మాత్రమే సినిమా చేస్తుందట..!

Anilkumar
టాలీవుడ్ లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. నాగార్జునకు జోడీగా సూపర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సౌత్ లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ కి సరైన హిట్ రావడం లేదు. అనుష్క చివరిసారిగా నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అనుష్క ప్రస్తుతం సినిమాల విషయాల్లో జోరు తగ్గించేసింది. 

అయితే తాజాగా అనుష్క కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటికే అనుష్క దగ్గరికి రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించే అవకాశం రాగా.. తనకు ఆ సినిమాల్లో నటించడం అంత ఆసక్తి లేకపోవడంతో వాటిని తిరస్కరించిందట. అయితే ప్రస్తుతం అనుష్క ఖాతాలో ఒకే ఒక సినిమా ఉంది. అది కూడా అగ్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో జాతిరత్నాలు నవీన్ పోలిశెట్టి తో మొదటి సారి కలిసి నటిస్తోంది. అయితే ఇటీవల అనుష్క ఓ స్టేట్మెంట్ ఇచ్చింది అనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో నడుస్తుంది.

ఇంతకీ ఆ విషయం ఏంటంటే తను కేవలం యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో మాత్రమే సినిమాలు చేస్తానని.. నిర్మాతలతో తాను పని చేయడానికి సిద్ధంగా లేనని చెప్పినట్టు ఇన్సైడ్ వర్గాలనుంచి సమాచారం అందుతోంది. దానికి కారణం యు.వి.క్రియేషన్స్ సంస్థ తన అభిరుచికి అనుగుణంగా సినిమాలు చేస్తుందని.. ముఖ్యంగా ఆ సంస్థ తనను హీరోల ట్రీట్ చేస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. ఇక ఈ వార్త తెలిసిన చాలామంది నెటిజన్లు అనుష్క రాబోయే కాలంలో తను చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీతో ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: