షాకింగ్ విషయాలు తెలియజేసిన యాంకర్ రష్మీ...!!

murali krishna
బుల్లి తెర హీరోయిన్ రష్మీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. మంచి యూత్ ఫాలోయింగ్ వున్న యాంకర్ గా బుల్లి తెరపై ఎంతో కాలంగా ఆమె దూసుకుపోతుంది.జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్ ఆ షో ద్వారా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ .యాంకర్ కాకముందు హీరోయిన్ గా కొన్ని సినిమాలలో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన కానీ ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించలేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ జంతు ప్రేమికురాలిగా మంచి పేరునే తెచ్చుకున్నది.జబర్దస్త్ మినహా మరే షోతో ప్రస్తుతం రష్మీ అంత బిజీగా లేదు. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉందట.. రష్మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా రష్మీ ఆ వార్తల గురించి స్పందించడానికి ఆసక్తి చూపడం లేదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా రష్మీ సోషల్ మీడియా వేదికగా కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది .ఒక మీమ్ లో మహిళ ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటే ఆమె పడుకుందని అంటారని పేర్కొనగా ఆ మీమ్ ను షేర్ చేస్తూ చాలా సింపుల్ గా ఆ మాటను అనేస్తారని రష్మీ గౌతమ్ తెలిపారట..

రష్మీ గౌతమ్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీలక పాత్ర చేస్తుందట.. కెరీర్ విషయంలో రష్మీ గౌతమ్ ఆచితూచి అడుగులు వేస్తుందని సుధీర్ రష్మీ జోడీకి కూడా ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత తగ్గించింది.ఈ జోడీ ఈ మధ్య కాలంలో స్కిట్లు, పాటలు కలిసి చేయడం లేదనే విషయం తెలిసిందే. రష్మీ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. రష్మీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన తెలియాలి మరి.గతంలో వచ్చిన చిన్న చితక ఛాన్సులు కాకుండా మంచి ప్రాధాన్యత వున్న పాత్ర వస్తే అనసూయలా తాను చెలరేగిపోవడానికి సిద్ధముగా వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: