అశ్వినీ దత్ ఆ సినిమాతో రిస్క్ చేయబోతున్నాడా..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నిర్మాతలు ఉంటారు,  వారిలో కొంతమంది మంచి పేరు ఉన్న హీరోలతో సినిమాలను తీస్తూ ఉంటారు.  మరి కొంతమంది నిర్మాతలు మాత్రం అంతగా సక్సెస్ లేని హీరోలతో,  కొత్త హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తు  వారి రేంజ్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టి  సినిమాలను తెరకెక్కిస్తు ఉంటారు. అలా ఆ హీరోల కంటే ఎక్కువ రేంజ్ లో ఖర్చుపెట్టి సినిమాలను నిర్మించే నిర్మాతలకు కొన్ని సార్లు ఆ సినిమాల ద్వారా అపజయాలు ఎదురైనా కొన్ని సార్లు  మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఎదురవుతూ ఉంటాయి,  ఇలా రిస్క్ చేసి సినిమాలను నిర్మించే టాలీవుడ్ నిర్మాతలలో  అశ్వినీ దత్ ఒకరు.  ప్రస్తుతం కూడా అశ్విని దత్ ఒక రీస్కీ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తేగ వైరల్ అవుతుంది, అసలు విషయంలోకి వెళితే...  శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీ లీల  హీరోయిన్ గా అశ్వినీ దత్ ఒక సినిమాను తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  అయితే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో పెళ్లి సందD సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా బడ్జెట్ పది కోట్ల లోపే అని తెలుస్తుంది,  అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా సాధించలేదు.

  ఇలాంటి సందర్భంలో అశ్వినీ దత్,  రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఒక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది,  అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు 20 కోట్ల వరకు అశ్విని దత్ ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  ఇలా పది కోట్ల లోపు సినిమాలో నటించిన హీరో,  హీరోయిన్ ల మీద ఒకేసారి 20 కోట్లు ఖర్చు పెట్టి అశ్వినీ దత్ సినిమా తెరకెక్కించబోతున్నట్లు  వార్తలు రావడంతో ఈ సినిమాతో అశ్విని దత్ రిస్కు చేస్తున్నట్లు కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: