మిర్చి : వచ్చి 9 ఏళ్ళైనా ... ఘాటు ఇంకా తగ్గలేదు .... ??

GVK Writings
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో మిర్చి కూడా ఒకటి. మెసేజ్ తో పాటు మంచి యాక్షన్, కమర్షియల్ హంగుల కలబోతగా సినిమాలు తీసి పెద్ద సక్సెస్ లు అందుకోవడంలో దిట్ట అయిన కొరటాల శివ తీసిన తొలి సినిమానే మిర్చి. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ ఒక కీలక పాత్ర చేసారు. సంపత్, సుబ్బరాజు, ప్రియా, హేమ, నాగినీడు, బ్రహ్మానందం వంటి వారు ఇతర రోల్స్ చేసిన ఈ సినిమా 2013 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద సక్సెస్ అందుకుంది.
అప్పటివరకు వచ్చిన ప్రభాస్ కెరీర్ లోని అన్ని సినిమాల్లోకి మిర్చి అతి పెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఇక కథ పరంగా చూస్తే పాత కథే అయినప్పటికీ దానిని ఆడియన్స్ మనసు దోచేలా సరికొత్తగా తీయడంలో అన్ని విధాలుగా దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యారు. ఇక హీరో ప్రభాస్ అయితే జై పాత్రలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించగా వెన్నెల పాత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అనుష్క కూడా మంచి మార్కులు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌడ్ స్కోర్ అయితే మరింత అద్భుతం అని చెప్పాలి. ఈ మూవీలోని ఇదేదో బాగుందే చెలి, మిర్చి లాంటి కుర్రాడే, డార్లింగే ఓరి నా డార్లింగే వంటి సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడా వినపడుతూనే ఉంటాయి.
యువి క్రియేషన్స్ బ్యానర్ పై తొలి వెంచర్ గా వంశీ, ప్రమోద్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఆ విధంగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు నేటితో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 9 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో తమ మూవీని ఎంతో ఆదరించిన ప్రభాస్ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ నేడు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసారు. ఇక ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టర్ ని చూసిన పలువురు ప్రభాస్ ఫ్యాన్స్, తమ హీరో బ్లాక్ బస్టర్ సినిమా 9 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో మరొక్కసారి యూనిట్ కి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: