అఖండ సీక్వెల్ : టెన్షన్ గా వున్న అభిమానులు ?

Purushottham Vinay
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అటు బాలయ్య కెరీర్ కు ఇంకా అలాగే ఇటు బోయపాటి శ్రీను కెరీర్ కు అఖండ సినిమా సక్సెస్ బాగా ప్లస్ అయింది.ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక బోయపాటి శ్రీను తర్వాత సినిమా రామ్ హీరోగా తెరకెక్కనుందని వార్తలు వస్తుండగా ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను ఏకంగా 12 కోట్ల రూపాయల పారితోషికం కూడా తీసుకుంటున్నారని ప్రచారం అనేది జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం తెలుస్తుంది.అయితే అఖండ సినిమాకు సీక్వెల్ అనేది ఉంటుందని అటు బాలయ్య ఇంకా ఇలాగే ఇటు బోయపాటి శ్రీను అఖండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. 

అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కాలంటే మాత్రం మరో మూడేళ్లు దాకా ఆగాల్సిందేనని సమాచారం తెలుస్తుంది. రామ్ తో బోయపాటి శ్రీను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా అనేది తెరకెక్కాల్సి ఉంది.ఇక బోయపాటి శ్రీను ఇప్పటికే ఓకే చెప్పిన ఈ ప్రాజెక్టులు అనేవి చాలా ఆలస్యం కానున్నాయి. ఎంత ఆలస్యం అంటే ఇక అఖండ2 సినిమా ఆలస్యానికి కూడా కారణమవుతున్నాయి.ఇక ఆలస్యం సంగతి పక్కనపెడితే ఈ సినిమా అసలు ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ గాసిప్ తో నందమూరి అభిమానులు ఫుల్ టెన్షన్లో వున్నారు.మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: