బాలయ్య గోపీచంద్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

Purushottham Vinay
రవితేజ తో తీసిన `క్రాక్`సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ .. బాలయ్యతో చేయబోయే తన తాజా చిత్రాన్ని కూడా అదే స్థాయి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ తొలిసారి బాలయ్యకు జోడీగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే ఇంత వరకు కూడా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభించలేదు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రెగ్యులర్ షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వస్తోంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ముందు అనుకున్న ప్రకారం జనవరి 11 నుంచి ప్రారంభించాల్సి వుంది కానీ ప్రస్తుతం వున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ప్లాన్ ని దర్శకుడు మార్చినట్టుగా సమాచారం తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించి ఓ అప్ డేట్ బయటికి వచ్చేసింది. మారిన ప్లాన్ ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ఫబ్రవరి 12 నుంచి ప్రారంభించబోతున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో మొదటి షెడ్యూల్ ని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్టుగా సమాచారం అనేది తెలుస్తోంది.

సినిమా ప్రారంభమే మాంచి యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టాలని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారట. ఇక్కడ యాక్షన్ సీన్స్ని కూడా పూర్తి చేసి కడపలో మరో కీలక ఘట్టాలని తెరకెక్కిస్తారట. ఇందు కోసం అక్కడ భారీ షెడ్యూల్ నే గోపీచంద్ మలినేని ప్లాన్ చేపినట్టుగా సమాచారం తెలుస్తుంది. `క్రాక్`సినిమాలో వేట పాలెం బ్యాచ్ కి సంబంధించిన సన్ని వేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాని కూడా వేటపాలెం నేపథ్యంలో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారని సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో కూడా బాల కృష్ణ చిత్రీకరించే యాక్షన్ ఘట్టాలు సినిమాకు పెద్ద హైలైట్ గా నిలుస్తాయని సమాచారం తెలుస్తోంది. సినిమా అంతా కూడా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ఆయన మేకోవర్ కూడా చాలా కొత్తగా ఇంకా అద్భుతంగా వుండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ విన్న వారంతా కూడా ఈ మూవీతో బాల కృష్ణ మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం గ్యారంటీ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: