మహేష్ రాజమౌళి సినిమాలో విలన్ గా గోపి చంద్..

Purushottham Vinay
టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా బాగా నడుస్తోంది. దీంతో మన స్టార్ హీరోలు ఇంకా సీనియర్ హీరోలు ప్యాడింగ్ కోరుకుంటున్నారు. దీంతో కొత్త కొత్త కాంబినేషన్ లు అనేవి ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి.ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్` సినిమా కోసం హీరో రానాతో కలిసి నటించిన విషం తెలిసిందే. మలయాళ హిట్ సినిమా `అయ్యప్పనుమ్ కోషియుమ్` సినిమా ఆధారంగా ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో వైపు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తను చేస్తున్న సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా యువ హీరో నేచురల్ స్టార్ నాని కూడా సీనియర్ హీరో మెగాస్టార్ తో కలిసి నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో మహేష్ - రాజమౌళి సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. భారీ స్థాయిలో అడ్వెంచరస్ మూవీగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో హీరో గోపీచంద్ విలన్ గా నటించే అవకాశం వుందని వార్తలు షికారు చేస్తున్నాయి. గత కొంత కాలంగా నుంచి రాణిస్తున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో `పక్కా కమర్షియల్` పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కు సిద్ధమవుతోంది. ఇదిలా వుంటే గోపీచంద్ మళ్లీ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ ల చిత్రంతో విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని వార్తలు అనేవి వినిపిస్తున్నాయి.గతంలో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన `నిజం` సినిమాలో హీరో గోపీచంద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మరో సారి ఈ ఇద్దరు కలిసి ఈ సినిమా చేయబోతున్నారని గోపీచంద్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: