మీరా జాస్మిన్ రీఎంట్రీ కి అసలు కారణం అదేనా..?

Anilkumar
టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది మీరాజాస్మిన్. మీరా జాస్మిన్ అంటేనే అందరికీ ఫ్యామిలీ రోల్స్ గుర్తుకువస్తాయి. అంతలా ఈమె టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయింది. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించిన ఈమె మళ్ళీ చాలాకాలం తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది.ఇక మీరా సోషల్ మీడియాలో అంతా ఆక్టివ్ గా ఉండేది కాదు.. కానీ ఇటీవల ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఈమెను లక్షల్లో అభిమానులు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన మీరాజాస్మిన్.. ప్రస్తుతం మకల్ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది.

ఒకప్పుడు టాలీవుడ్ లో భద్ర, గుడుంబా శంకర్, పందెంకోడి, గోరింటాకు వంటి చిత్రాలతో తెలుగు సినీ అభిమానులకు దగ్గరైన మీరాజాస్మిన్..తన డీసెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అలాగే యువ లాంటి సినిమాలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రవితేజ, విక్రమ్,విశాల్ వంటి పెద్ద హీరోలతో నటించిన మీరాజాస్మిన్.. సౌత్ లో తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ క్రేజ్ తో వరుస హిట్స్ అందుకొని దాదాపు పదేళ్లపాటు బిజీబిజీ గా సినిమాలు చేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ ఫ్యామిలీ హీరోయిన్.. ఇప్పుడు మళ్ళీ తన సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అంతేకాదు ప్రస్తుతం తాన మకాం ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకుందని సమాచారం.

ఇక ప్రస్తుతం గతంలో తనతో సినిమాలు చేసిన హీరో లను దర్శకుల్ని కలిసి మీ సినిమాల్లో అవకాశాలు ఇవ్వండి అంటూ అందరినీ రిక్వెస్ట్ చేస్తోందట. అయితే ఉన్నట్టుండి మీరాజాస్మిన్ సినిమాల పై ఫోకస్ పెట్టడానికి గల కారణం ఆర్థికఇబ్బందులు అని తెలుస్తోంది. మీరా జాస్మిన్ ఆమె భర్త నుంచి విడిపోయిందని.. అలాగే ఆమెకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని.. కొంతమంది కుటుంబ సభ్యులే ఆమెను మోసం చేశారని.. దాంతో సేవింగ్స్ అన్ని వడ్డీలకు కట్టాల్సి వచ్చిందని.. అందుకే ఏం చేయాలో తెలియక ప్రస్తుతం సినిమాల్లో తిరిగి నటించడం తప్ప ఆమెకు మరో దారి కనిపించడం లేదని, అందుకే అవకాశాల కోసం అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలుగులో ఈ అమ్మడికి ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: