సందీప్ కిషన్ కు అంత సీన్ ఉందా!!
ఇక ఇటీవలే పుష్ప సినిమాతో ఇండియా మార్కెట్లోకి ఎంతో గ్రాండ్ గా అడుగుపెట్టాడు అల్లు అర్జున్. ఆ విధంగా ఆయన పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టక ముందే భారీ వసూళ్లను సాధించాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ సినిమా లైగర్ ను పాన్ ఇండియా ఫిలిం గా చేయనున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి పూరి జగన్నాథ్ దీన్ని భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా విజయ్ దేవరకొండకు బాలీవుడ్లో భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిస్తున్నారు.
ఇకపోతే టాలీవుడ్ లో ఎక్కువగా హిట్స్ అందుకోని హీరో సందీప్ కిషన్ కూడా మైకేల్ అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తుండడం విశేషం. తెలుగులో సరైన మార్కెట్ లేని ఈ హీరో ఏ విధంగా పాన్ ఇండియా మార్కెట్ లో స్టార్ గా ఎదుగుతాడు అని అనుకున్నారో ఏమో ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. కథ ఆ లెవెల్ సినిమాను డిమాండ్ చేసింది అనుకుంటే హీరో కూడా అంతటి మార్కెట్ ఉన్న హీరో ని ఎంపిక చేసుకోవాలి. అలా కాకుండా సందీప్ కిషన్ ను ఎంపిక చేసుకోవడం పట్ల కొంతమంది సినిమా విమర్శకులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు.