వావ్.. అతనికి ఓకే చెప్పేసిన వరలక్ష్మి శరత్ కుమార్?
కేవలం లేడీ విలన్ పాత్ర లోనే కాదు నటనకు ప్రాధాన్యం ఉన్న అన్ని పాత్రలలో కూడా నటిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకనిర్మాతలు అందరికీ కూడా పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి శరత్ కుమార్ మొదటి ఆప్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇటీవలే మైకేల్ అనే సినిమాలో ఒక కీలక పాత్ర నచ్చటంతో దర్శకుడికి ఓకే చెప్పేసిందట. ఇదే ఈ విషయాన్ని ఇటీవల చిత్రబృందం అధికారికంగా చెప్పేసింది. యువ హీరో సందీప్ కిషన్ దివ్యాంశ కౌశిక్ జంటగా ఈ సినిమాలో నటించబోతున్నారు.
సందీప్ జయ కోటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇటీవలి కాలంలో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తన నటనతో మెప్పించిన వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ పాత్ర ఎంతో సరికొత్తగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. అయితే తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతు ఉండటం గమనార్హం.