కృతి శెట్టి చుట్టూ తిరుగుతున్న అదృష్టం !

Seetha Sailaja
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే పూజా హెగ్డే పేరు సమాధానంగా చెప్పేవారు. ఇప్పుడు లాక్ విషయంలో పూజా కు కృతి శెట్టి పోటీ వస్తోంది. ఆమెకు వరసపెట్టి వస్తున్న హిట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. సాధారణంగా హీరోయిన్ పేరు చెప్పగానే ఆమె గ్లామర్ గుర్తుకు వస్తుంది కాని ఆమె నటించిన పాత్రలు గుర్తుకు రావు.

అయితే కృతి శెట్టికి మాత్రం ఆమె నటించే సినిమాలలోని పాత్రలను బట్టి ఆమెకు గుర్తింపు రావడంతో ఆమె కెరియర్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘ఉప్పెన’ మూవీలో బేబమ్మ పాత్రతో ఆమె గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన ‘బంగార్రాజు’ మూవీలో నాగలక్ష్మి పాత్రలో ఆమె లేడీ సర్పంచ్ గా చెలరేగిపోయింది.

మధ్యలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలో ఆమె నటించిన పాత్రకు పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ ఆమూవీ కూడ హిట్ అవ్వడంతో ప్రస్తుతం కృతి హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్ గా అందరి దృష్టిలో పడింది. వాస్తవానికి గతంలో పూజా హెగ్డే ను ఆమె కెరియర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పిలిచేవారు. అయితే ఆతరువాత ఆమె నటించిన సినిమాలు వరసగా బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో ఆమె గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది అయితే కృతి శెట్టి విషయం వేరు.  

ఆమె రావడంతోనే ఆమెకు పట్టిందల్లా బంగారం అన్న సామెత లా ఆమె సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులలో విడుదలైన ‘బంగార్రాజు’ ఘన విజయంలో ఆమె పాత్ర చాల కీలకంగా మారింది. దీనికితోడు ఈమె ఈమూవీ ప్రమోషన్ లో కూడ చాల ఉత్సాహంగా పాల్గొంటూ ఈమూవీ మ్యానియాను పెంచడానికి తనవంతు కృషి చేస్తోంది. త్వరలో ఈమె ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో కూడ నటించబోతోంది. ఇవన్నీ చూస్తుంటే పూజా హెగ్డే రష్మిక లకు రానున్న రోజులలో కృతి శెట్టి గెట్టి పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: