కరోనా బారిన పడ్డ దుల్కర్ సల్మాన్..

Purushottham Vinay
మాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్‌ కరోనా భారిన పడ్డారు. ఇక ఈ విషయాన్ని ఈ స్టార్ హీరో కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసాడు.'నాకు కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ లో పాజిటివ్ అని తేలింది. ఇక ప్రస్తుతం నేను హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాను.ప్రేక్షకులు అంతా కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదిలిపోలేదు. అజాగ్రత్తగా వ్యవహరించకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి.బయటకి వెళ్తే మాస్క్ ధరించడం అసలు మర్చిపోకండి' అంటూ అతను చెప్పుకొచ్చాడు. గతవారం దుల్కర్ తండ్రి మమ్ముట్టి కూడా కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే దుల్కర్ సల్మాన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

దుల్కర్ సల్మాన్ అనే కాదు ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా వైరస్ మహమ్మారి భారిన పడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇక దుల్కర్ సినిమాల విషయానికి వస్తే… 'ఒకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ మొదటి సినిమాతో మంచి ఫలితాన్నే అందుకోని హిట్ కొట్టాడు.ఇక ఆ సినిమాలో తన పాత్రకి న్యాచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పాడు. కొంత గ్యాప్ తర్వాత వచ్చిన 'మహానటి' సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తర్వాత వచ్చిన 'కనులు కనులను దోచాయంటే' 'కురుప్' వంటి చిత్రాలు దుల్కర్ ఇమేజ్ ను అమాంతం పెంచాయి. ప్రస్తుతం అతను హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగు ఇంకా మలయాళం భాషల్లో ద్విభాషా సినిమాగా రూపొందుతోంది. 'మహానటి' నిర్మాతలే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: