ప్రభాస్ సలార్ సినిమాకు రాధే శ్యామ్ గండం..!!
ఈ రకమైన వార్తలు ఇప్పటినుంచే మొదలవుతున్నాయి. ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి విడుదల కావాల్సి ఉండగా అది కాస్తా కరోనా కారణం గా విడుదల పోస్ట్ పోన్ చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్న సంగ్దిగ్డత చిత్ర బృందం లో సైతం వ్యక్తం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా ను పూర్తికాగానే తదుపరి సినిమా షూటింగ్ లకు వెళ్ళిపోయాడు. అలా సలార్ సినిమా ను పూర్తి చేసే స్థితికి తీసుకు వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మొదటి నుంచి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా అన్ని పనులను చేసుకున్నాడు ప్రభాస్. అయితే అనూహ్యంగా రాధే శ్యామ్ చిత్రం విడుదల ఆగిపోవడం ఈ సలార్ సినిమా పై ప్రభావం పడుతుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఓ సరికొత్త ఆలోచన చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆయన చేస్తున్నాడట. ఇదే జరిగితే ఇంత పెద్ద స్థాయి ఉన్న హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి ఒకే రోజున విడుదల కావడం నిజంగా వింతే అవుతుంది అని చెప్పవచ్చు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.