సుడిగాలి సుధీర్ తో.. ఆ హీరోయిన్ ప్రేమలో పడిపోయిందా?
ఇక బుల్లితెరపై ఒక రకంగా సుడిగాలి సుదీర్ బుల్లితెర సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా మెజీషియన్ గా కూడా తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. అయితే సుదీర్ ఎక్కువగా ఫేమస్ కావడానికి అటు రష్మితో లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ కారణం అనే విషయం తెలిసిందే. వీరిద్దరి లవ్ ట్రాక్ కారణంగానే ప్రేక్షకులందరూ రష్మీ సుధీర్ నూ అభిమానించడం మొదలు పెట్టారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం రష్మీ సుధీర్ జోడి అంతలా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ ఇటీవలే ఓ హీరోయిన్ మాత్రం సుడిగాలి సుదీర్ నూ చూసి చిరునవ్వు నవ్వింది. దీంతో సుడిగాలి సుధీర్ టాలెంట్ కి ఆ హీరోయిన్ ఫిదా అయిపోయి లవ్ లో పడిపోయిందా ఏంటి అన్న చర్చ మొదలయింది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమో లో భాగంగా హీరోయిన్ నందిత శ్వేతా స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అంతా ఎప్పటిలాగానే ప్రోమో సందడిగా సాగింది. ఇక ప్రోమో చివరిలో సుడిగాలి సుదీర్ నూ చూస్తూ సిగ్గుపడింది నందిత శ్వేత. సుధీర్ ని చూస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ అనిపిస్తుంది అంటూ మెలికలు తిరిగిపోయింది. ఇది చూసిన తర్వాత అరే ఈ హీరోయిన్ మా సుధీర్ అన్న తో ప్రేమలో పడిపోయినట్టు ఉందే అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.