నిఖిల్, అడవి శేష్ లకు గ్యాప్ దొరకనివ్వడం లేదా..!!

P.Nishanth Kumar



టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చిన్న హీరోల పరిస్థితి ఎంతో గందరగోళంగా ఉంది అని చెప్పవచ్చు. పెద్ద హీరోలే కరోనా దెబ్బకు తట్టుకోలేక పోతుంటే చిన్న హీరోలు చూడడం తప్ప ఏమీ చేయలేక పోతున్నారు. వారు నటించే సినిమాలు తప్పకుండా ప్రేక్షకులందరూ థియేటర్ లకు వచ్చే సీజన్ లోనే  విడుదల చేయాలి. లేదంటే భారీ నష్టాలు చవి చూస్తారు.  కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు రావడం కాదు కదా ఓ టీ టీ లో కూడా చిన్న హీరోల సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోయింది.

ఆ విధంగా టాలీవుడ్ లో హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునీ మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు నిఖిల్ మరియు అడవి శేష్. వీరిద్దరు కూడా తమ గత సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కూడా మంచి కాన్సెప్ట్ లతో ముందుకు రాబోతున్నారు. నిఖిల్ సుకుమార్ నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 18 పేజెస్ అనే చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం.

ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ చిత్రం మొదలై చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా ఈ సినిమా విడుదల కాకపోవడం ఈ సినిమా యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఇటు శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో అడవి శేష్ హీరో గా నటిస్తున్న సినిమా కూడా విడుదల కాలేని పరిస్థితిలో ఉంది. మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించే కాన్సెప్ట్ ఉన్న సినిమా అని మొదటి నుంచి భావిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ప్రేక్షకులను ఎప్పుడు అలరిస్తాయో చూడాలి.పోనీ ధైర్యం చేసి విడుదల చేద్దామా అనే పెద్ద సినిమాలు అన్ని కూడా స్లాట్స్ బుక్ చేసుకోవడం తో ఈ సినిమా ల విడుదల లు సంగ్దిగ్దం లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: