ప్చ్ పాపం : సాయి పల్లవి ఫ్యాన్స్ కి నిజంగా నిరాశే ... ?

GVK Writings
టాలీవుడ్ యువ నటి సాయి పల్లవి తొలిసారిగా ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమ్ముల దర్శత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి, శర్వానంద్ తో పడి పడి లేచే మనసు వంటి సక్సెఫుల్ సినిమాలు చేసిన సాయి పల్లవి అటు తమిళ్ లో కూడా ధనుష్, సూర్య వంటి అగ్ర నటుల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.
ఇక ఇటీవల ఆమెకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ లో చెల్లెలి పాత్ర వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన తాను వదులుకోవాల్సి వచ్చిందని సాయి పల్లవి స్వయంగా వెల్లడించారు. అయితే లేటెస్ట్ గా మరొక్కసారి నానితో కలిసి ఆమె చేసిన శ్యామ్ సింగ రాయ్ మూవీ పెద్ద సక్సెస్ కొట్టింది. ఆ సినిమాలో ఆమె పోషించిన దేవదాసి పాత్రకు అందరి నుండి మంచి పేరు లభించింది. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం సాయి పల్లవి ఒక పెద్ద స్టార్ హీరో మూవీలో చెల్లెలిగా అఫర్ అందుకుందని కొద్దిరోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీయనున్న భారీ ఎంటర్టైనర్ లో మహేష్ కి చెల్లిగా సాయి పల్లవి నటించనున్నారనేది ఆ వార్త యొక్క సారాంశం. అయితే ఈ విషయమై సాయి పల్లవి సన్నిహితులు మాత్రం అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారట.
నిజానికి ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇక ఆమె వద్దకు మహేష్ మూవీ అఫర్ అయితే రాలేదని వారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు మహెష్ వంటి బడా స్టార్ మూవీలో తమ హీరోయిన్ కి అఫర్ వచ్చిందని తెలియడంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అయితే ప్రస్తుతం అది ఒట్టి పుకారు మాత్రమే అని తేలడంతో వారు ఒకింత నిరాశ చెందినట్లు తెలుస్తోంది. అటు సాయి పల్లవి కూడా సూపర్ స్టార్ మహేష్ కి పెద్ద ఫ్యాన్ కావడంతో ఆమె కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అటు మహేష్ ఫ్యాన్స్ ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: