భీమ్లా నాయక్ సినిమా విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్న చిత్ర బృందం..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది, ఇప్పటికే భీమ్లా నాయక్  సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచాయి,  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి వున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

 అయితే అనుకున్న తేదీ కంటే ఈ సినిమా విడుదల తేదీకి మరికొంత సమయం దొరకడంతో భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి, ఈ వార్తలపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు,  ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చాడు, ఇప్పటికే తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.  పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నాడు, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు, ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడానికి రెడీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: