బాలయ్య షోకి త్వరలో శుభంకార్డు పడబోతుందా..!!

N.ANJI
నందమూరి నటసింహం తన సినీజీవితంలోనే మొదటిసారిగా చేసిన షో అన్ స్టాపబుల్‌. ఈ షో ఎన్నో అనుమానాలు మధ్య మొదలైన అనూహ్యంగా మంచి స్పందన అందుకుంది. అల్లు అరవింద్ నిర్మించిన తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో లో బాలకృష్ణ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రముఖ టాలీవుడ్ స్టార్స్ ను ఇప్పటికే తీసుకు వచ్చిన బాలయ్య వారితో ఆడుతూ పాడుతూ సరదాగా వారితో ముచ్చట్లు పెడుతూ అభిమానుల మనస్సు దోచుకున్నాడు.
అయితే బాలయ్య ఈ షో కు సంబంధించిన చివరి ఎపిసోడ్ ను అతి త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు..  ప్రతి టాక్ షో కూడా కచ్చితంగా సీజన్లు గా స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు బాలయ్య ఈ టాక్స్ ను కూడా సీజన్‌ లుగా స్ట్రీమింగ్ చేయడం కోసం ఆహా ఓటీటీ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. మళ్లీ ఈ ఏడాది చివర్లో బాలయ్యతో ఈ టాక్ షో సీజన్ టు ను మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
కాగా.. సీజన్ వన్ ముగించడానికి ఇప్పటికే ఒక వీడియోను విడుదల చేసిన సంగతి అందరికి తెల్సిందే. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్లో వచ్చిన మొత్తం ఎపిసోడ్ లకు సంబంధించిన బెస్ట్ పార్ట్‌ లను ఎడిట్ చేసి చివరి వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ షోలో సంక్రాంతి కానుకగా ఈ వారం లైజర్ చిత్ర యూనిట్ సభ్యులతో బాలయ్య సందడి చేశారు.
ఇక ఈ వారం ఎపిసోడ్ ఇటీవల షూటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. కాగా.. వచ్చే వారంలో టాప్ షో సీజన్ వన్ ఎపిసోడ్లో స్ట్రీమింగ్ చేయబోతునట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ ముగిసినా రాలేదంటే వచ్చే సీజన్ కి మహేష్ బాబు ఎపిసోడ్ కి వాయిదా వేస్తారా లేదంటే ఈ సీజన్లోనే చివరిగా ఆ ఎపిసోడ్ గా స్ట్రీమింగ్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: