షాక్:మహేష్ తో ఆమెను చూడలేమంటున్న అభిమానులు.. కారణం..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే అవకాశం ఏ ఒక్క హీరోయిన్ కి వచ్చిన తెగ సంబరపడిపోతూ ఉంటారు. అయితే ఈ అందగాడి తో మాత్రం హీరోయిన్ గా నటించే అవకాశాన్ని మాత్రమే అంత ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కానీ మహేష్ సోదరి గా నటించాలంటే ఏ హీరోయిన్ అయినా ఎక్కువగా ఇష్టపడదు.. ఇక మహేష్ బాబుకు సిస్టర్ గా సాయి పల్లవిని అభిమానులు కూడా జీర్ణించుకోలేరు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే.. హీరోయిన్ సాయి పల్లవి మహేష్ బాబు సిస్టర్ పాత్రలో నటించబోతోంది అనే వార్త వినిపిస్తోంది. ఇక మహేష్ సర్కార్ వారి పాట సినిమా.. పనిలో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు కరోనా నుంచి కోలుకున్న వెంటనే.. షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా బాగా వేగవంతంగా జరుగుతోందట. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ తన మ్యూజిక్ ను కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఇందులో కథానాయకులుగా పూజా హెగ్డే లేదా సమంత  మాత్రమే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక అంతే కాకుండా ఈ సినిమాలో సాయి పల్లవి కి మహేష్ బాబు అన్నగా నటిస్తున్నాడు అని వార్త బాగా పాపులర్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు.. జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సాయి పల్లవిని  మహేష్ బాబుకి జోడిగా చూడాలనుకున్నాము..కానీ సోదరిగా అంటే చూడలేము అని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.కానీ సాయి పల్లవి మాత్రం మహేష్ బాబు తో ఏ విధంగా నటించడానికి అయినా ఓకే అని చెప్పినట్లుగా సమాచారం.. అయితే ఇప్పుడు ఇలాంటి విషయం బయటకు వచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: