షాక్:మహేష్ తో ఆమెను చూడలేమంటున్న అభిమానులు.. కారణం..?
తాజాగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు కరోనా నుంచి కోలుకున్న వెంటనే.. షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా బాగా వేగవంతంగా జరుగుతోందట. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ తన మ్యూజిక్ ను కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఇందులో కథానాయకులుగా పూజా హెగ్డే లేదా సమంత మాత్రమే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక అంతే కాకుండా ఈ సినిమాలో సాయి పల్లవి కి మహేష్ బాబు అన్నగా నటిస్తున్నాడు అని వార్త బాగా పాపులర్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు.. జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం సాయి పల్లవిని మహేష్ బాబుకి జోడిగా చూడాలనుకున్నాము..కానీ సోదరిగా అంటే చూడలేము అని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.కానీ సాయి పల్లవి మాత్రం మహేష్ బాబు తో ఏ విధంగా నటించడానికి అయినా ఓకే అని చెప్పినట్లుగా సమాచారం.. అయితే ఇప్పుడు ఇలాంటి విషయం బయటకు వచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.