మహేష్ బాబు కోట్లు నష్టపోయేలా చేసిన సినిమా ఏదో తెలుసా?
శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాశ్ రాజ్, సునీల్, ఆలీ కీలక పాత్రలను పోషించారు. ఓ శక్తివంతుడైన వ్యాపారవేత్త చేతిలో పడి నలిగిపోతున్న పేదలను ఓ టాక్సీ డ్రైవర్ ఎలా కాపాడు అన్నదే ఈ సినిమా కథ. దాదాపు మూడేళ్ల పాటు ఖలేజాను తీస్తూ ఉండేసరికి ఈ చిత్రం ఎలా ఉంటుందనే ఆతృత అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.
కానీ, భారీ అంచనాల నడుమ 2010 సెప్టెంబరు 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు రావడంతో.. మహేష్ బాబు ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్లో సగభాగాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. ఈ విధంగా ఖలేజా సినిమా కారణంగా మహేష్ బాబు కొన్ని కోట్ల రూపాయిలను వదులుకోవాల్సి వచ్చింది.
అయితే ఖలేజా సినిమా వెండితెరపై హిట్ అవ్వకపోయినా బుల్లితెరపై మాత్రం ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. కాగా, మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా పూర్తైన తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ చిత్రం చేయనున్నాడు.