వార్నీ.. అనసూయను ఆది ఎంత దారుణంగా కామెంట్ చేశాడు?

praveen
జబర్దస్త్ యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన అనసూయ తక్కువ సమయంలోనే ఎంతగానో గుర్తింపు సంపాదించింది. తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైపోయింది. తన వాక్చాతుర్యంతో అనసూయ అంటే మన పక్కింటి అమ్మాయి అన్నంతగా ప్రేక్షకులు ఆమెను ఆదరించడం మొదలుపెట్టారు. జబర్దస్త్ కార్యక్రమం లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా అడుగు పెట్టి తన నటనతో అందర్నీ మెప్పిస్తూ వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది అనసూయ. అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం  సినిమాలో రంగమ్మత్త అనే కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు రంగమ్మత్త గా మారిపోయింది ఈ అమ్మడు.

 ఇక ఇటీవలే అదే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అందరినీ భయపెట్టింది అని చెప్పాలి. మంగళం శీనుగా సునీల్ నటిస్తే ఇక మంగళం శీను భార్య దాక్షాయిని పాత్రలో నటించింది అనసూయ. ఎప్పుడు నోట్లో కిల్లి వేసుకుని నములుతూ ఎంతో మాస్ లో కనిపించింది. చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ పవర్ ఫుల్ గానే కనిపించింది అనసూయ. ఏకంగా పగ తీర్చుకోకుండా హాయిగా పడుకున్నందుకు మొగుడు గొంతు కోసే తెగింపు ఉన్న దాక్షాయిని పాత్రలో అనసూయ ఒదిగిపోయి నటించిందని చెప్పాలి.

 పుష్ప సినిమాలో అనసూయ నటించిన దాక్షాయిని పాత్రను స్పూఫ్ చేస్తూ ఇటీవలే హైపర్ ఆది పై కామెంట్ చేశాడు. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది టీం పుష్పా సినిమా పై స్పూఫ్ చేస్తూ స్కిట్ చేసింది. ఇక ఈ స్కిట్ లో భాగంగా దాక్షాయిని పాత్రలో శాంతిస్వరూప్ ఎంట్రీ ఇస్తాడు. అచ్చం పుష్ప సినిమాలో అనసూయ గెటప్ ఎలా ఉందో అలాగే రెడీ అయిపోతాడు. కాగా స్కిట్ లో భాగంగా డైలాగులు చెబుతూ నువ్వు అనసూయ అచ్చం సేమ్ టు సేమ్ ఉంటారూ అంటూ కామెంట్ చేస్తాడు హైపర్ ఆది. దీంతో అనసూయ ఎంతో కోపంగా చూస్తోంది. ఇక అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: