రాధే శ్యామ్: సరికొత్త డేట్.. ఈసారైనా రిలీజ్ చేస్తారా..?
ఇకపోతే ఈ సినిమా పాటలు ..టీజర్.. ట్రైలర్ అన్నీ చూసి ప్రేక్షకులు మరింత అంచనాలను పెట్టుకున్నారు.. కానీ సినిమా రిలీజ్ వాయిదా పడడానికి..కరోనా ఒక కారణమైతే.. సినీ ఇండస్ట్రీలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించడం ఇంకో కారణం అయింది. అందుకే ఈ రెండు కారణాల వల్ల కూడా సినిమాను రిలీజ్ చేయ లేక వాయిదా వేసుకున్నారు. ఇకపోతే నిన్నటికి నిన్న చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయి టికెట్ ల విషయంపై చర్చించగా సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అని మీడియా వేదికగా అందరికీ వెల్లడించారు.
ఒక సమస్య సద్దుమణిగింది కాబట్టి ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అందరూ ఎదురు చూడగా కానీ కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న తరుణంలో సినిమా మరో రెండు నెలలు వాయిదా వేశారు.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొవిడ్ నియంత్రణలోకి వస్తే మార్చి 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించడం జరిగింది. కరోనా తగ్గకపోతే మళ్లీ ఈ తేదీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఏది ఏమైనా ప్రేక్షకులు ఈ సినిమా కోసం కరోనా తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నట్లు సమాచారం.