లైగర్ పై గట్టి అంచనాలే పెట్టుకున్నారు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ మరియు మైక్ టైసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తెలుగులో వరుసగా తెరకెక్కుతున్న నేపథ్యం లో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు.

దానికి పూరి జగన్నాథ్ కూడా తోడవడంతో ఈ సినిమా స్థాయి భారీ గా పెరిగిపోయింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ప్రేక్షకులలో. విజయ్ దేవరకొండ కు భారీ హిట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది అని చెప్పాలి. ఆయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టు కోలేకపోవడం తో ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ సాధించాలి అనేది విజయ్ దేవరకొండ టార్గెట్. ఆ టార్గెట్ తగ్గట్లుగానే ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదల కాగా ఈ సినిమా భారీ స్థాయిలో నే తెరకెక్కుతుంది అని స్పష్టం చేశారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సినిమా గ్లింప్స్ బయటకు రాగానే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. భారీ స్థాయిలో గ్లింప్స్ విడుదల సెలబ్రేషన్స్ చేసి సినిమా వైపు అందరూ చూసేలా చేశారు.  అంతే కాదు ఈ సినిమా ను ఆగస్టు 25వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటించిన చిత్ర బృందం ఒక్కసారిగా అభిమానులలో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేసిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: