జై బాలయ్య: IMDb కెక్కిన బాలయ్య..!

Divya
మొట్టమొదటిసారిగా నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ ఆహా టాక్ షోతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఇటు బుల్లితెరపై కూడా ఎదురు లేకుండా చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ షో ద్వారా ఎంతో మంది టాప్ సెలబ్రిటీలలో తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ వారితో తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు బాలయ్య.
ఆహా లో మొదలైన ఈ షో కి మొదటిసారి గెస్ట్ గా మంచు మోహన్ బాబు..వారి వారసులు మంచు విష్ణు అలాగే మంచు లక్ష్మి లతో హాజరై ఎన్నో విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక అంతే కాదు చంద్రబాబుకు , మోహన్ బాబు కు మధ్య ఉన్న వివాదాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఇందులో స్పష్టంగా తెలియజేశారు. మొదటి ఎపిసోడ్ తోనే విశేష ఆదరణ పొందిన ఈ షోకి ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని , ఎస్.ఎస్.రాజమౌళి, బ్రహ్మానందం, రవితేజ వంటి వారు వచ్చి బాగా అలరించారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా టీం కూడా ఈ ఆహా టాక్ షోలో మెరవడం గమనార్హం.
ఇదిలా ఉండగా తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఐ.ఎమ్.డి.బి.లో టాప్ టెన్ రియాల్టీ టీవీ జాబితాలలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. అంతేకాదు తాజాగా వెల్లడించిన IMDb జాబితాలో టాప్ టెన్ రియాల్టీ షోలలో ఈ షో ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక షో ప్రారంభమైన అతి కొద్ది రోజులకే ఇంతటి ఘనత సాధించడం తో బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ సినిమా తరువాత బాలయ్య తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని తో తీయడానికి సిద్ధ మయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను రాబడుతూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: