బాలయ్య అభిమానులకు అదిరిపోయే సంక్రాంతి కానుక..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా విడుదలైన అఖండ సినిమాతో బాక్సాఫీసు దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు,  ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రతినాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించగా మరో ముఖ్య పాత్రలో పూర్ణ నటించింది. వంద కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న బాలకృష్ణ, క్రాక్ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ నటిస్తోంది.

 అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ కనిపించనుండగా మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నట్లు, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ చివరలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సమ్మర్ చివరలో ఈ సినిమాను విడుదల చేయడం కుదరకపోతే  దసరాకు ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా చిత్ర బృందం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: