ఆ పొర‌పాటు వ‌ల్లే బ‌న్నీ హీరోయిన్ కెరీర్ నాశ‌నం అయిందా..?

VUYYURU SUBHASH
కేథ‌రిన్ థ్రెసా.. ఈ అందాల భామ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శంకర్ ఐ.పి.ఎస్` అనే క‌న్న‌డ చిత్రంతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన కేథ‌రిన్.. 2013లో `చమ్మక్ చల్లో` అనే మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. రెండో సినిమాకే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందుకుని `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలో న‌టించింది.
డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాధ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా చ‌తికిల ప‌డింది. అయిన‌ప్ప‌టికీ కేథ‌రిన్ బాగానే అవ‌కాశాలు ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలోనే బ‌న్నీకి జోడిగా కేథ‌రిన్ మ‌ళ్లీ రుద్రమదేవి, సరైనోడు చిత్రాల్లో న‌టించింది. వీటిల్లో బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌రైనోడు చిత్రం మంచి విజ‌యం సాధించింది.

ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది. కానీ, ఈ సినిమా ద్వారా ఆమెకు పెద్ద‌గా ఒరిగిందేమి లేదు. ఈ మూవీ త‌ర్వాత గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో న‌టించింది గానీ.. స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఆమె ఎద‌గ‌లేక‌పోయింది. అయితే కేథ‌రిన్ థ్రెసా స్టార్ హీరోయిన్ల చెంత చేర‌లేక‌పోవ‌డానికి కార‌ణం ఆమె చేసిన పొర‌పాటేన‌ట‌.
మంచి మంచి అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడు రెమ్యూన‌రేష‌న్ వ‌ల్ల‌నో లేదా ఇత‌రిత‌ర కార‌ణాల‌తోనూ కేథ‌రిన్ రిజెక్ట్ చేసేద‌ట‌. దాంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆమెను స‌రిగ్గా ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. అందు వ‌ల్ల‌నే కేథ‌రిన్ కెరీర్ నాశ‌నం అయింద‌ని టాక్ ఉంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో కేథ‌రిన్‌కే తెలియాలి. కాగా, ఈ బ్యూటీ చివరగా నటించిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. విజయ్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దీంతో  ప్ర‌స్తుతం కేథ‌రిన్ అవ‌కాశాలు కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: