శభాష్ ప్రభాస్ : సిరివెన్నెల ఫ్యామిలీని పరామర్శించిన ప్రభాస్ .... ??

GVK Writings
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారిగా ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. తన తండ్రి సూర్యనారాయణ ఆశీస్సులతో పాటు పెదనాన్న కృష్ణంరాజు నట వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ కొట్టారు. ఇక అక్కడి నుండి వరుసగా ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్, ఆపైన అనేక మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక కొన్నేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాల భారీ సక్సెస్ లతో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప పేరు, మార్కెట్ సొంతం చేసుకున్న ప్రభాస్ అనంతరం సాహో మూవీ చేసారు.
ఇక త్వరలో ప్రభాస్ నటించనున్న రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మొదటి నుండి హీరోగా ఎంత గొప్ప పేరు అందుకున్నప్పటికీ కూడా ఎంతో ఒదిగి ఉండి అందరితో ఎంతో కలుపుగోలుగా వ్యవహరిస్తూ తన మంచి మనసుని చాటుకునే ప్రభాస్, తనతో కలిసి పని చేసిన వారు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటె వెంటనే వారికి తనకు వీలైన సహాయం అందిస్తుంటారు. ఇక విషయం ఏమిటంటే ఇటీవల ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో తన సినిమా షూటింగ్ కి సంబంధించి వేరే చోట ఉన్న ప్రభాస్ సిరివెన్నెలని కడసారి చూపు చూడలేకపోయారు.
ఇక నిన్న ప్రత్యేకంగా సిరివెన్నెల నివాసానికి వెళ్లిన ప్రభాస్ దాదాపుగా ఒక అరగంట సేపు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. తన కెరీర్ లోని ఎన్నో గొప్ప పాటలను సిరివెన్నెల గారు రాసారని, అంతేకాక తెలుగు కళామతల్లి గర్వించదగ్గ గొప్ప రచయిత సిరివెన్నెల గారని, అటువంటి మహోన్నత వ్యక్తి ప్రస్తుతం మన మధ్యన లేకపోవడం దురదృష్టం అని, ఎక్కడ ఉన్నా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటూ ప్రభాస్ అక్కడ మీడియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్, సిరివెన్నెల ఇన్ని వెళ్లిన సమయంలో అక్కడికి అనేకమంది మీడియా వరకు విచ్చేసి ఈ వార్తని ఎంతో వైరల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: