పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు బోయపాటి శ్రీను, ఈయన సినిమాలు మాస్ అంశాలతో ఉంటూ ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాడు. ఈ దర్శకుడు ఇప్పటివరకు మంచి మాస్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు,  అయితే ఈ దర్శకుడు ఈ మధ్యనే అఖండ  సినిమాకు దర్శకత్వం వహించాడు, ఈ సినిమా ఈ మధ్యనే విడుదల అయ్యింది, ఈ  సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది,  పుష్కలమైన మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

  అయితే ఈ దర్శకుడు అఖండ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి, కాకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ వన్ ను రిలీజ్ చేసి ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్నాడు, అలాగే మరి కొద్ది రోజుల్లో పుష్ప పార్ట్ టు షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు,  అయితే  బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ 'పుష్ప'  పార్ట్ 2 ముగిసే లోపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమాకు కథను కూడా బోయపాటి శ్రీను రెడీ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లోను మరికొద్ది రోజుల్లో పాల్గొనబోతున్నారు, ఈ రెండు సినిమాలతో పాటు భగవదియుడు భగత్ సింగ్, సినిమా లోనూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు, మరి ఈ సినిమాల తర్వాత నే పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: