బాలయ్యను ఢీ కొట్టనున్న ఆ హీరో..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఈ మధ్యనే థియేటర్ లలో విడుదలయ్యింది, ఈ సినిమా మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది, అయితే ఇలాంటి విజయం తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.  గోపీచంద్ మలినేని కూడా ఈ సంవత్సరం రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఇలా ఒకే సంవత్సరం బాక్స్ ఆఫీస్  దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి, ఈ సినిమాలో బాలకృష్ణ ను  గోపీచంద్ మలినేని డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నట్లు,  మరో పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నార‌ట‌, ఆ నటుడు మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. ఇప్పటికే అర్జున్, నితిన్ హీరోగా తెరకెక్కిన 'లై'  ,  విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యుడు సినిమాలలో విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాంటి ఈ క్రేజీ హీరో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: