సాయంత్రం 7 గంటలకు.. సాయి పల్లవి ట్విట్ వైరల్?
దీంతో ఇక ఈ సినిమాలోని పాటలు మరింత స్పెషల్ గా మారిపోయాయి. చివరిగా ఈ సినిమాలోని పాటలు రాసి సిరివెన్నెల సీతారామశాస్త్రి తుదిశ్వాసవిడిచారు. ఇక పోతే ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.. ఇకపోతే ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..
ఇక ఈ సినిమాలో నాని ఏకంగా రెండు షేడ్స్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలోని మరో పాట విడుదలకు సిద్ధమైంది. ప్రణవాలయ అనే ఒక పాట ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు విడుదల కాబోతుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటను రాయడం గమనార్హం. ఇక ఈ పాటలో సాయి పల్లవి ప్రధానంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట ప్రణవాలయ ఈరోజు 9 గంటలకు విడుదల కాబోతోంది అంటూ తన ట్విట్టర్ వేదికగా తెలిపింది సాయిపల్లవి. దీంతో ఈ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు.