100 సినిమాల ద‌ర్శ‌కుడితో బాల‌య్య సినిమా...!

VUYYURU SUBHASH
యువరత్న నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో కెరీర్ లోనే తిరుగులేని సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. కరోనా తర్వాత అసలు థియేటర్లకు వచ్చి జనాలు సినిమాలు చూస్తారా ? అన్న సందేహాలను బాలయ్య తన అఖండ సినిమాతో పటాపంచలు చేసేశాడు. బాలయ్య కెరీర్లోనే తొలి వంద కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కింది. అఖండ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్య తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆ తర్వాత అనిల్ రావిపూడి తో కూడా మరో యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసేందుకు ప్లాన్ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలయ్య శతాధిక చిత్రాల దర్శకుడు అయిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా శ్రీ రామానుజాచార్యుల కథ ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. బాలయ్య సినిమాలో రామానుజుల వారి పాత్ర పోషించబోతున్నారు అని తెలుస్తోంది. బాల‌య్య కు వేదాలు , దైవం మీద ఎంత ప‌ట్టు ఉంటుందో తెలిసిందే. అసలు ఈ సినిమాలో కూడా అఖండ పాత్ర‌కు బాల‌య్య త‌ప్ప మ‌రో హీరోను మనం ఊహించుకోలేము.

రామానుజులు.. వేదాంత సాగరం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాసి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందారో తెలిసిందే. ఆయ‌న బ్ర‌హ్మ సూత్రాలు, భ‌గ‌వ‌ద్గీత‌కు కూడా భాష్యం ర‌చించారు. ఇక అన్న మ‌య్య సినిమా ర‌చ‌యిత అయిన జేకే. భార‌వి ఈ సినిమాకు సంబంధించి స్క్రిఫ్ట్ రెడీ చేశార‌ని తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న శ్రీ మంజునాథ‌, శ్రీరామ‌దాసు సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.

ఇప్పుడు ఆయ‌నే రామానుజ‌ల క‌థ తో రాఘ‌వేంద్ర రావును సంప్ర‌దించ‌గా ఆ క‌థ‌ను పూర్తి డ‌వ‌ల‌ప్ చేయ‌మ‌ని సూచించార‌ట‌. టాలీవుడ్ అగ్ర నిర్మాత ఈ ప్రాజెక్టును సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గ‌తంలో బాల‌య్య - రాఘ‌వేంద్ర రావు కాంబోలో పాండురంగ‌డు లాంటి భ‌క్తిర‌స సినిమా వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: