ఓటీటీలో నాగ చైతన్య 'థాంక్యూ'.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

Anilkumar
టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ నటించిన 'లవ్ స్టోరీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాలో సాయి పల్లవి తో పాటు చైతూ కూడా అద్భుతమైన నటనను కనబరిచి ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు ఓ సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ అందరితో 'మనం' అనే సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాని అందించిన ఈ దర్శకుడు..

ఆ తర్వాత అఖిల్తో కూడా 'హలో' అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు చైతూతో సినిమా చేస్తున్నాడు విక్రమ్ కె.కుమార్. ఇక ఈ సినిమాకి 'థాంక్యూ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాగచైతన్య మునుపెన్నడూ లేని విధంగా ఒక విభిన్న తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే చైతు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ చిన్న టీజర్ గ్లిమ్స్ విడుదలై మంచి స్పందనను రాబట్టింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ లో విడుదల కానుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఆ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..

చిత్ర యూనిట్ ఆ వార్తలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చింది. థాంక్యూ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడం లేదని పేర్కొన్న చిత్ర యూనిట్.. ఎట్టి పరిస్థితుల్లో  ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతుకు జోడిగా రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక వీరితో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడట. ఇక సరైన సమయం చూసి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: