నెట్టింట వైరల్ గా మారిన చై-సామ్‌ ఓల్డ్‌ ఫోన్‌ కాల్‌ వీడియో..!!

VUYYURU SUBHASH
నాగచైతన్య సమంత ఎంతో ఇష్టపడి ఇంట్లో పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి అప్పుడు హడావుడి మాములుగా లేదు. గోవా లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. అక్కడ చేసిన సందడి..ఆ పాటలు డ్యాన్సులు అబ్బో అప్పట్లో మీడియాలో నిత్యం హెడ్ లైన్స్ లో వచ్చేవి. ఇక పెళ్లి తరువాత కూడా ఈ జంట అస్సలు తగ్గలేదు టైం ఉన్నప్పుడల్లా టూర్లు.. ఖాళీ దొరికినప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా అందరి చేత పిలిపించుకున్నారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే నాలుగేళ్ల  తరువాత విడాకులు తీసుకొవడానికి సిద్ధపడ్డారు. ఫ్రెండ్స్ గా ఉంటాం అంటూ కూడా తెలియజేసారు. అయితే కనీసం  సమంత చైతన్య పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీంతో వీళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందని జనాలు ఫిక్స్ అయిపోయారు. కానీ అభిమానులు మాత్రం ఈ జంట మళ్లీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే వాళ్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోటోలు , వీడియోలు నెట్టింట షేర్ చేస్తూ ప్లీజ్ చై-సామ్‌ మీరు మళ్ళీ కలిసిపోండి అంటూ కామెంట్స్  పెడుతున్నారు.
ఈ క్రమంలోనే చై-సామ్‌ కు సంబంధించిన ఓ ఓల్డ్‌ ఫోన్‌ కాల్‌ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో చైతన్య రకుల్ తో కలిసి ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న  "కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా" అనే షోకు వస్తారు. ఇక ప్రదీప్  చైకి ఓ టాస్క్ ఇస్తారు. ఈ క్రమంలోనే.." సమంతకు ఫోన్‌ చేసిన చైతన్య వారి ఫస్ట్‌ మూవీ డైలాగ్‌ను చెప్పుతూ.."ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నేను సామ్‌నే ఎందుకు ప్రేమించాను" అని అంటున్నప్పుడు సమంత రిప్లై ఇస్తూ.."నేను నీకు మరో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’అంటూ చెబుతుంది. ఇక  ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జంట మళ్లీ కలిస్తే బాగుండు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: