ఇంతకన్న ఏం చెప్పగలం.. మనసును పిండేస్తున్న సాయి పల్లవి పోస్ట్..!!
కాగా , క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ పాట అభిమానులను ఎంత ఆకట్టుకుంటుందో మాటల్లో చెప్పలేం. ఎప్పటిలాగే ఆయన లోని మాటల మ్యాజిక్ ఈ పాటలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా అనిపించే ఈ పాట ఖచ్చితంగా అవార్డులు సొంతం చేసుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరిగా రాసిన పాట ను అనురాగ్ కులకర్ణి తనదైన గాత్రంతో అధ్బుతంగా పాడారు. ఆయన పదాలకు..సింగర్ గొంతుకు పాట కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక ఈ పాటలో తెర పై మనం సాయి పల్లవి , నాని లను జంటగా చూడచ్చు. ఇక ఇదే పాట గురించి సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయని తెలియజేసారు. సాయి పల్లవి ట్వీట్ చేస్తూ.. "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు..మీరు రాసిన పాటల్లోని ప్రతి పదం మీ ఆత్మను మా ముందుకు తీసుకు వస్తోంది. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా ..ఎప్పటికీ మా హృదయాల్లో మీ పాటల రూపంలో జీవించే ఉంటారు సార్’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. దీంతో ఓ అభిమాని గా ఆమె ఇంతకన్నా ఏం చెప్పగలరు అంటూ నెటిజన్స్ కూడా ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు.