రవితేజ ధమాకా.. మరీ అంత తొందరగానా!!
ఈ నేపథ్యంలో సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయడం పట్ల ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు సినిమా విశ్లేషకులు. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలను ఒకేసారి పూర్తి చేసి వాటిని ఒకేసారి విడుదల చేస్తున్నాడు మాస్ రాజా. ఈ విషయం తో నే అందరు ఆశ్చర్యపోతుంటే ఇప్పుడు ధమాకా కూడా పూర్తిచేసి వేసవిలో విడుదల చేస్తున్నాడు అనే విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోతున్నా రు. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఆయన సుధీర్ వర్మ అనే దర్శకుడితో కలిసి ఓ పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నారు.
దీనికి రావణాసుర అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమా ను కూడా తొందరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి వేరే సినిమా లకి వెళ్ళిపోవాలనేది రవితేజ ఆలోచన. ఈ సంవత్సరం క్రాక్ సినిమా తో హిట్ కొట్టి ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాడు రవితేజ. ఆ ఉత్సాహం లోనే ఇప్పుడు వరుస సినిమా లను అనౌన్స్ చేసుకుంటూ ముందు కు దూసుకు పోతున్నాడు. మరి ఈ చిత్రాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.