టాలీవుడ్ లో ఆ నిర్మాత ఇంకా లేనట్టే...?

Sahithya
తెలుగు సినిమాలో కొంత మంది నిర్మాతలు ఒకప్పుడు ఎక్కువగా ప్రభావం చూపిన సరే తర్వాత కమర్షియల్ సినిమాలు ఎక్కువగా రావడంతో కొంత మంది నిర్మాతలు ప్రభావం అనేది తగ్గింది అనే మాట వాస్తవం. ప్రస్తుతం కొంతమంది దర్శక నిర్మాతలు తెలుగు సినిమా మీద దృష్టి పెట్టడం కంటే కూడా వ్యాపారాలు మీద దృష్టి పెట్టి సినిమాకు దూరంగా ఉన్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో శాసించిన నిర్మాతలు కూడా ఇప్పుడు సినిమాల్లో పెట్టుబడులు పెట్టడం కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఒకప్పుడు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన నిర్మాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని కర్ణాటక అలాగే హైదరాబాద్ లో ఎక్కువగా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు మీదనే దృష్టి పెట్టారని తన వారసుని కూడా ఆయన వ్యాపార రంగంలోని సినిమా వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారని వద్దని వారించి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించారని దాదాపుగా ఆరు వందల కోట్ల పెట్టుబడులు కేవలం రియల్ ఎస్టేట్ రంగం లోనే పెట్టినట్టుగా టాలీవుడ్ జనాలు అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాదులో వేగంగా అభివృద్ధి చెందటంతో సదరు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని అదే విధంగా తన కుమార్తెను కూడా విదేశాలకు వెళ్లకుండా కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పూర్తిగా దృష్టి సారించే విధంగా ఒప్పించారని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే సినిమాలకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద సదరు నిర్మాత దృష్టి పెట్టడం మాత్రం కాస్త హాట్ టాపిక్ అయింది. గత రెండేళ్ల నుంచి సినిమాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతోనే సదరు నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: