ఒళ్లు గగుర్పొడిచేలా ఆకట్టుకుంటున్న పుష్ప ట్రైలర్..!!

Divya
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాణ సారథ్యం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోగా స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లుఅర్జున్ నటిస్తుండగా, హీరోయిన్గా రష్మిక మందన నటిస్తున్నారు. ప్రధాన పాత్రలలో ఫాహద్ ఫాసిల్, ధనుంజయ్, రావు రమేష్ ,అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నిన్న రాత్రి 10 గంటలకు విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.
సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పార్ట్ వన్ ను  సుకుమార్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా దేశవ్యాప్తంగా మలయాళం, తమిళ్ ,హిందీ, తెలుగు ,కన్నడ భాషలలో రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. భూమండలంలో ఎక్కడా పెరగని చెట్టు మన శేషాచలం అడవులలో పెరుగుతోంది.. ఇక్కడి నుంచే వేలకోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతోంది. గోల్డ్ రా ఇది గుంపై పెరిగే బంగారం ..ఎర్రచందనం అంటూ వచ్చే ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..
ఇకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సెన్సేషన్  మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా,  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అంతేకాదు టీజర్లు, పోస్టర్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత స్థాయిలో పెరిగాయి. నటరాజ్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ  ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ లో అనసూయా, రష్మిక ,సునీల్, అల్లు అర్జున్ పాత్రలు హైలెట్గా నిలబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: