మెగాస్టార్ తో బోయపాటి.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కి మంచి క్రేజ్ ఉంది.అయితే ఇటీవల కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' సినిమా డిజాస్టర్ ని మూటకట్టుకోవడం తో ఆ సినిమా రిజల్ట్ తర్వాత బోయపాటి తో సినిమా చేయాలంటే చాలా మంది హీరోలు భయపడ్డారు. కట్ చేస్తే.. తాజాగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో స్టార్ హీరోలు సైతం ఇప్పుడు బోయపాటితో సినిమా చేసేందుకు సై అంటున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లను అందుకుంటోంది.

బోయపాటి టేకింగ్ కి బాలయ్య యాక్షన్ తోడవడంతో ఈ సినిమా ను మాస్ ఆడియన్స్ తో పాటూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా అఖండ సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే ఏకంగా 18 కోట్ల షేర్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే 30 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రికార్డు సృష్టించింది. దీంతో బాలయ్య, బోయపాటి శ్రీను తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

తాజాగా విడుదలైన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బోయపాటి తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు అది త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా లాంచ్ చేయనునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ తో తెరకెక్కే సినిమా కూడా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందట. ఇక ప్రస్తుతం ఈ వార్తతో మెగా ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: