బాలయ్య టాప్ షో గురించి తన ఫీలింగ్ ను పంచుకున్న మహేష్ బాబు..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఇప్పటికే ఈ టాక్ షో కు 3 మూడు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ కు మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ లు గిఫ్ట్ లు రాగా, రెండవ ఎపిసోడ్ కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా విచ్చేశాడు, ఇలా వీరితో సరదాగా ముచ్చటించి, అనేక ఆటలు ఆడించిన బాలకృష్ణ ఈ టాక్ షో ను బ్లాక్ బస్టర్ చేశాడు. అయితే ఈ రెండు ఎపిసోడ్ లు ముగిసిన తర్వాత బాలకృష్ణ చేతికి చిన్న సర్జరీ కావడం వల్ల కొంత కాలం పాటు ఈ టాక్ షో కు దూరమయ్యారు, ఆ తర్వాత మళ్లీ చేతి కాయం కాస్త తగ్గడం తో తిరిగి ఆన్ స్టాపబుల్ టాక్ షో ను బాలకృష్ణ ప్రారంభించాడు.

అందులో భాగంగా మూడవ ఎపిసోడ్ కు తెలుగు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గెస్ట్ లుగా వచ్చారు. ఇలా ఇప్పటికే బాలకృష్ణ మూడు ఎపిసోడ్ లను సక్సెస్. అయితే తాజాగా మహేష్ బాబు, బాలకృష్ణ  టాక్ షో  కు గెస్ట్ వచ్చాడు,  ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయ్యింది, దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజా గా బాలకృష్ణ షో లో పాల్గొనడంపై మహేష్ బాబు స్పందిస్తూ.. నా సాయంత్రాన్ని అన్ స్టాపబుల్ NBK తో పూర్తి గా ఆనందించాను అంటూ రాసుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు  సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: